కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై కిషన్ రెడ్డి స్పందన
- అవిశ్వాస తీర్మానం వల్ల ఒరిగేది ఏమీ లేదన్న కిషన్ రెడ్డి
- బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడూ ఒకటేనని విమర్శ
- తెలంగాణలో మార్పు రావాలంటే బీజేపీ ప్రభుత్వం రావాల్సిందేనని వ్యాఖ్య
బీఆర్ఎస్ పార్టీ కారు స్టీరింగ్ ఎంఐఎం దగ్గర ఉందని కిషన్ రెడ్డి అన్నారు. కేవలం బీజేపీ మాత్రమే బీఆర్ఎస్ తో పోరాటం చేస్తుందని... బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడూ కుటుంబ పార్టీలే అని విమర్శించారు. తెలంగాణలో మార్పు రావాలంటే బీజేపీ ప్రభుత్వం రావాల్సిందేనని చెప్పారు.