అమెరికాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక అవార్డు
- గ్లోబల్ ఇన్క్రెడిబుల్ ఐఎన్సీ లీడర్షిప్ అవార్డు అందుకున్న
కిషన్ రెడ్డి - భారత సంస్కృతి, పర్యాటక అభివృద్ధికి చేసి కృషికి గుర్తింపు
- ఈ మధ్యే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియామకం
అమెరికాలోని మేరీలాండ్ నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు ఆయనకు ఈ అవార్డును అందజేశారు. ఈ అవార్డు పట్ల కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో దేశంలో ఘనమైన చరిత్రను, సంస్కృతిని కాపాడుకునేందుకు పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. దానికి గుర్తింపుగానే ఈ అవార్డు దక్కిందని అన్నారు. కాగా, బండి సంజయ్ స్థానంలో బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే.