ఈసారి చంద్రబాబుకు సవాల్ విసిరిన మంత్రి విడదల రజని
- గతవారం లోకేశ్ కు సవాల్ విసిరిన రజని
- దమ్ముంటే ఆరోగ్యశ్రీపై చర్చకు రావాలని సవాల్
- నేడు గుడివాడలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి-2 ప్రారంభించిన రజని
- ఐదేళ్ల పాలనలో ఏంచేశారో చెప్పాలంటూ చంద్రబాబుకు సవాల్
చంద్రబాబు ప్రజల్లో నమ్మకం కోల్పోయారని, ఇప్పుడాయన మేనిఫెస్టో అంటూ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు మాటలకే పరిమితం అని ఎద్దేవా చేశారు. కాగా, ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి కొడాలి నాని కూడా పాల్గొన్నారు. గుడివాడలో కొడాలి నానిని ఓడించే సత్తా టీడీపీకి లేదని మంత్రి రజని అన్నారు.