ఏపీకి మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్.. ఈ నెల 7 నుంచి సర్వీసులు ప్రారంభం

Vijayawada Chennai Vande Bharat Express
  • విజయవాడ - చెన్నై నగరాల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్
  • 8వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో సర్వీసులు
  • ఒకట్రెండు రోజుల్లో వెల్లడి కానున్న టికెట్ ధరలు, రాకపోకల షెడ్యూల్ వివరాలు
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రానికి మరో వందేభారత్ రైలు వస్తోంది. విజయవాడ-చెన్నై నగరాల మధ్య ఈ నెల 7 నుంచి వందేభారత్ రైలు రాకపోకలు మొదలు కానున్నాయి. దేశ వ్యాప్తంగా ఐదు వందే భారత్ రైళ్లను మోదీ ప్రారంభించనున్నారు. ఇందులో విజయవాడ- చెన్నై మధ్య నడిచే రైలు ఒకటి. ఈ నెల 8 నుంచి రైలు సర్వీసులు పూర్తి స్థాయిలో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ రైలు ఏయే స్టేషన్లలో ఆగుతుంది, రాకపోకల షెడ్యూల్, టికెట్ ధరలు తదితర వివరాలను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. విజయవాడ-రేణిగుంట మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని రేణిగుంట మీదుగా రైలును నడపాలని విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు కోరినట్టు తెలుస్తోంది. 

Go Back to Shorts
Andhra Pradesh
Vande Bharat Express
Vijayawada
Chennai

More Telugu News