Somu Veerraju: ఆ విషయం చంద్రబాబునే అడగండి.. సోము వీర్రాజు అసహనం

  • కేంద్ర పథకాలను తనవిగా చెబుతున్న జగన్ ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్న వీర్రాజు
  • కేంద్రం నిధులిస్తున్నా పోలవరం పూర్తిచేయడం లేదని మండిపాటు
  • బీజేపీ 9 ఏళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా చిత్తూరులో బహిరంగ సభ
AP BJP Chief Somu Veerraju Says Jagan A Dubbing Artist

వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు సంగతేంటన్న ప్రశ్నకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అసహనం వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని వెళ్లి చంద్రబాబునే అడగాలని విలేకరులకు సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్తూరులో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిన్న బహిరంగ నిర్వహించారు. 

అనంతరం విలేకరులతో వీర్రాజు విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర నిధులతో అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్న జగన్ ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని ఎద్దేవా చేశారు. కేంద్రం నిధులు ఇస్తున్నా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జగన్ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రం అప్పులు, అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిందని విమర్శించారు.  

More Telugu News