మణిపూర్లో కొనసాగుతున్న హింస.. కేంద్రమంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబుతో దాడి
- మీటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్
- ఆందోళనకారుల దాడిలో ధ్వంసమైన కేంద్రమంత్రి ఇల్లు
- అడ్డుకోలేకపోయిన సెక్యూరిటీ సిబ్బంది
- రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్న మంత్రి
- కష్టార్జితంతో కట్టిన ఇళ్లు ధ్వంసం చేశారని ఆవేదన
ఆ సమయంలో మంత్రి ఇంటి వద్ద 22 మంది భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నప్పటికీ పెద్ద సంఖ్యలో వచ్చిన ఆందోళనకారులను నిలువరించలేకపోయారు. మే నెలలోనూ మంత్రి ఇంటిపై దాడి జరిగినా భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపు చేశారు. కాగా, గురువారం మధ్యాహ్నం ఆందోళనకారులు మరో రెండు ఇళ్లకు నిప్పు పెట్టారు. తన ఇంటిపై జరిగిన దాడి గురించి తెలిసిన కేంద్రమంత్రి రంజన్ కేరళ నుంచి వెంటనే తిరుగుపయనమయ్యారు. కష్టార్జితంతో కట్టుకున్న ఇంటిని ధ్వంసం చేయడం తనను షాక్కు గురిచేసిందన్నారు. తాను అవినీతిపరుడిని కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు.