భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం... నాటు తుపాకితో భార్యపై కాల్పులు
- జూలూరుపాడు మండలంలో ఘటన
- భార్యతో గొడవపడి కాల్పులు
- బాధితురాలి పరిస్థితి విషమం
- నిందితుడి కోసం పోలీసుల గాలింపు
సమాచారం అందుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడివున్న శాంతిని వెంటనే కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అటవీ జంతువులను వేటాడేందుకు ఉపయోగించే తుపాకితో నిందితుడు కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న సామ కోసం గాలిస్తున్నారు. శాంతకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు.