Vijay Devarakonda: మరోసారి పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ!

  • విజయ్ దేవరకొండకి కథ చెప్పిన పరశురామ్ 
  • 'గీత గోవిందం' తరువాత కలిసి చేయనున్న సినిమా 
  • నిర్మాతగా వ్యవహరించనున్న దిల్ రాజు 
  • విజయ్ దేవరకొండ నుంచి రానున్న 'ఖుషీ'
Vijay Devarakonda in Parashuram Movie

పరశురామ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'గీత గోవిందం' సంచలన విజయాన్ని నమోదు చేసింది. అటు యూత్ లోను .. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ లోను ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమా తరువాత ఒక వైపున పరశురామ్ .. మరో వైపున విజయ్ దేవరకొండ సినిమాలు చేసుకుంటూ వెళ్లినా, ఆ మేజిక్ మాత్రం మళ్లీ రిపీట్ కాలేదు. 

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'ఖుషీ' సినిమా చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత కథానాయిక. ఇటీవలే 'టర్కీ'లో ఒక షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 1వ  తేదీన విడుదల చేయనున్నారు. ఆ తరువాత గౌతమ్ తిన్ననూరితో కలిసి విజయ్ దేవరకొండ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతూనే ఉన్నాయి. 

ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండకి పరశురామ్ ఒక కథను వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ కథ ఏ జోనర్లో నడుస్తుందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు తెలియనున్నాయి. 

More Telugu News