Prabhas: వేలాదిగా తరలివచ్చిన అభిమానుల సమక్షంలో 'ఆదిపురుష్' ఈవెంట్

  • ప్రభాస్ హీరోగా రూపొందిన 'ఆదిపురుష్'
  • తిరుపతిలో మొదలైన ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ముఖ్య అతిథిగా చినజీయర్ స్వామి 
  • ఈ నెల 16న ఐదు భాషల్లో విడుదలవుతున్న సినిమా
Adipurush Pre release Event

ప్రభాస్ తన కెరియర్లో చేసిన తొలి పౌరాణిక చిత్రమే 'ఆదిపురుష్'. టి - సిరీస్ వారు భారీ బడ్జెట్ తో ఈ పాన్ ఇండియా సినిమాను నిర్మించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీరాముడిగా ప్రభాస్ .. సీతాదేవిగా కృతి సనన్ నటించారు. ఈ నెల 16వ తేదీన ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును తిరుపతి - శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియం'లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా చిన జీయర్ స్వామి హాజరవుతున్నారు. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రభాస్ అభిమానులు ఈ వేడుకకి తరలివచ్చారు. 

మైదానంలో ఎటు చూసినా కాషాయరంగు జెండాలు కనిపిస్తున్నాయి. 'జై శ్రీరామ్' అనే నినాదాలు వినిపిస్తున్నాయి. సీతారాముల దివ్యచరితను లవకుశుల వేషధారణలో ఉన్న పిల్లలు చేసే గానంతో, ఈ స్టేజ్ పై సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పుడిప్పుడే ముఖ్య అతిథులు రావడం మొదలైంది.

More Telugu News