Siddhu Jonnalagadda: 'టిల్లు స్క్వేర్' రిలీజ్ డేట్ ఖరారు!

  • 2022లో వచ్చిన 'డీజే టిల్లు'
  • పెద్ద హిట్ కొట్టిన చిన్న సినిమా 
  • అదే బ్యానర్లో రూపొందుతున్న సీక్వెల్ 
  • సెప్టెంబర్ 15వ తేదీన విడుదల
Tillu Square release date confirmed

సిద్ధూ జొన్నలగడ్డ - నేహా శెట్టి జంటగా రూపొందిన 'డీజే టిల్లు', 2022 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, భారీ విజయాన్ని సాధించింది. యూత్ లోకి ఒక రేంజ్ లో దూసుకుపోయింది. కంటెంట్ ఉంటే ఒక చిన్న సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టగలదనేది ఈ సినిమా నిరూపించింది.

సితార - ఫార్చ్యూన్ బ్యానర్లపై నిర్మితమైన ఈ సినిమాకి, శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం, సక్సెస్ లో ముఖ్యమైన పాత్రను పోషించింది. అలాంటి ఈ సినిమాకి అవే నిర్మాణ సంస్థలు 'టిల్లు స్క్వేర్' పేరుతో  సీక్వెల్ ను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

'డీజే టిల్లు'లో నేహా శెట్టి కథానాయికగా నటిస్తే, 'టిల్లు స్క్వేర్'లో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ సందడి చేయనుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నవారు అప్పటివరకూ ఆగవలసిందే. 

More Telugu News