ఒడిశా రైలు ప్రమాదం: ఎలా ఉన్నారో.. అసలు ఉన్నారో లేదో!
- వంద మందికి పైగా ప్రయాణికుల జాడ లేదు
- ఫోన్లు స్విచ్ఛాఫ్.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
- బాలాసోర్ ఆసుపత్రిలో తమ వారి కోసం వెతుకులాట
బాధితుల కుటుంబ సభ్యులలో కొంతమంది బాలాసోర్, కటక్ ఆసుపత్రులకు చేరుకుని తమ వారి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిలో తమ వారు ఉండాలని ప్రార్థిస్తూ వెతుకుతున్నారు. అయితే, ఇటు ఆసుపత్రిలో కానీ అటు మార్చురీలలోని డెడ్ బాడీలలో కానీ వారి ఆచూకీ దొరకలేదని వాపోయారు. ఎక్కడ ఉన్నారో.. అసలు ఉన్నారో లేదోనని కన్నీటి పర్యంతం అవుతున్నారు. కనిపించిన ప్రతీ అధికారినీ ఆరా తీస్తున్నారు. మరోవైపు, రిజర్వేషన్ బోగీలలో ప్రయాణికులకు సంబంధించి కొంత స్పష్టత ఉన్నా.. జనరల్ బోగీలో ప్రయాణించిన వారి వివరాలు తెలుసుకోవడం మరింత కష్టంగా మారింది.