Uttar Pradesh: యూపీలో దారుణం.. భర్తను మంచానికి కట్టేసి భార్య, కుమార్తెపై అఘాయిత్యం

  • రాంపూర్ జిల్లాలోని సైఫానీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • బాధిత మహిళ, బాలికను ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు
  • ఇటీవల జరిగిన ఘటనే కారణమని పోలీసుల అనుమానం
Wife and daughter raped in front of husband in Uttar Pradesh

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు భర్తను మంచానికి కట్టేసి అతడి భార్య, కుమార్తెపై అత్యాచారానికి తెగబడ్డారు. రాంపూర్ జిల్లా సైఫానీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. ఓ మెకానిక్ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు దుండగులు అతడిని మంచానికి కట్టేశారు. ఆపై అతడి భార్య (36), మైనర్ అయిన అతడి కుమార్తె (13)పై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత మహిళ, ఆమె కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన వెనక ఇటీవల జరిగిన ఘర్షణే కారణమని తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు. మెకానిక్‌తో ఇటీవల కొందరు వ్యక్తులు గొడవకు దిగారని, వారే ఈ పనికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

More Telugu News