Tirumala: తిరుమలలో బాగా తగ్గిన భక్తుల రద్దీ

  • కొన్నిరోజుల కిందట తిరుమలలో విపరీతమైన రద్దీ
  • ప్రస్తుతం సాధారణ పరిస్థితులు
  • 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
  • శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం
Rush in Tirumala normalized

ఇటీవల భక్తుల తాకిడితో కిటకిటలాడిన తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రస్తుతం రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 84,539 మంది భక్తులు దర్శించుకున్నారు. 

నిన్న ఒక్కరోజే వెంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు లభించింది. 39,812 మంది భక్తులు తలనీలాల మొక్కు సమర్పించుకున్నారు.

More Telugu News