Vande Bharat Train: మరో వందేభారత్ రైలుకు నేడు జెండా ఊపిన ప్రధాని మోదీ

  • పూరీ-హౌరా స్టేషన్ల మధ్య వందేభారత్ రైలు
  • వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ
  • మే 20 నుంచి రెగ్యులర్ రైలు అందుబాటులోకి!
  • ఒడిశాకు ఇదే తొలి వందేభారత్
Modi inaugurates first Vande Bharat train in Odisha

భారత్ లో మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలెక్కింది. పూరీ-హౌరా నగరాల మధ్య తిరిగే ఈ వందేభారత్ రైలుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభోత్సవం చేశారు. ఒడిశాలోని పూరీ స్టేషన్ నుంచి పశ్చిమ బెంగాల్ లోని హౌరా స్టేషన్ల మధ్య తిరిగే ఈ సెమీ హైస్పీడ్ రైలును ప్రధాని మోదీ వర్చువల్ గా పచ్చజెండా ఊపారు. అంతేకాదు, రూ.8 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను కూడా మోదీ ప్రారంభించారు. కాగా, ఒడిశాకు ఇదే తొలి వందే భారత్ రైలు. పూరీ-హౌరా మధ్య 500 కిలోమీటర్ల దూరాన్ని 6.5 గంటల్లో ప్రయాణిస్తుంది. ఈ రైలు మే 20 నుంచి అందుబాటులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు.

More Telugu News