IPL: నేడు ఉప్పల్‌లో ఆఖరి ఐపీఎల్ మ్యాచ్‌.. ఆర్​సీబీకి చావోరేవో

  • రాత్రి 7.30 నుంచి మ్యాచ్ 
  • ప్లేఆఫ్స్ రేసులో ఆర్సీబీకి విజయం కీలకం
  • ఇప్పటికే నాకౌట్ రేసు నుంచి తప్పుకున్న సన్‌ రైజర్స్
Surisers hyderabad takes RCB today at uppal stadium

ఈ ఐపీఎల్ సీజన్ లో చెత్తగా ఆడుతూ ఆఖరి స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంతగడ్డపై చివరి మ్యాచ్ కు సిద్ధమైంది. ఈ రోజు రాత్రి ఉప్పల్  స్టేడియంలో జరిగే మ్యాచ్ లో రాయల్‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌ బెంగళూరు (ఆర్సీబీ)తో పోటీ పడనుంది. 12 మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు, ఎనిమిది పరాజయాలతో  8 పాయింట్లతో పట్టికలో అట్టడుగున ఉన్న సన్ రైజర్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్‌‌‌‌‌‌‌‌ రేసు నుంచి వైదొలిగింది. దాంతో, ఈ మ్యాచ్ లో గెలుపోటములు సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌ ను పెద్దగా ప్రభావితం చేయబోవు. అయితే, సొంత అభిమానుల మధ్య చివరి పోరులో గెలిచి పరువైనా దక్కించుకోవాలని సన్ రైజర్స్ ఆశిస్తోంది. మరోవైపు 12 మ్యాచ్ ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న ‌‌‌ఆర్సీబీకి ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో విజయం కీలకం కానుంది.  

నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓడిపోవడం ‌‌‌ఆర్సీబీకి ప్లస్ పాయింట్ కానుంది.  ప్రస్తుతం ఆర్సీబీతో పాటు 13 మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్, కేకేఆర్, పంజాబ్ 12 పాయింట్లతో ఉన్నాయి. ఆర్సీబీకి ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలున్నాయి. సన్‌ రైజర్స్‌ తో పాటు గుజరాత్ టైటాన్స్‌ తో జరిగే చివరి మ్యాచ్‌ లో భారీ తేడాతో గెలిస్తే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుకోగలదు. 

ఈ నేపథ్యంలో సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌పై భారీ విజయం సాధించాలని చూస్తోంది. ఈ పోరులో అందరి ఫోకస్ విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీపైనే ఉంది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ డుప్లెసిస్‌‌‌‌‌‌‌‌తో పాటు ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న విరాట్‌‌‌‌‌‌‌‌ గత రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో నిరాశ పరిచాడు. ఈ నేపథ్యంలో తనకు మంచి రికార్డున్న ఉప్పల్ స్టేడియంలో రెచ్చిపోవాలని చూస్తున్నాడు. మరోవైపు కోహ్లీ కోసం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ స్టేడియానికి పోటెత్తనున్నారు. మ్యాచ్ కోసం అందుబాటులో ఉంచిన టికెట్లన్నీ ఒక్క రోజులోనే అమ్ముడయ్యాయి.

More Telugu News