Road Accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురి దుర్మరణం

  • సుబ్బరాయుని దిబ్బ వద్ద ఘటన
  • ఆటోను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు
  • మృతులంతా మహిళలే!
  • రొయ్యల పరిశ్రమలో పనిచేసి తిరిగి వస్తుండగా ఘటన
Six dead in road accident

కాకినాడ జిల్లాలో రహదారి రక్తసిక్తమైంది. తాళ్లరేవు మండలం సీతారామపురం సుబ్బరాయుని దిబ్బ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ఈ ప్రమాదంలో మరణించినవారందరూ మహిళలే. ఓ ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మహిళలు ఓ రొయ్యల పరిశ్రమలో పనిచేసి ఆటోలో తిరిగి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది.

More Telugu News