ఎన్నికల ఫలితాలపై కుమారస్వామి స్పందన
- కర్ణాటక ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్న కుమారస్వామి
- గెలుపు, ఓటమిని సమానంగా స్వీకరిస్తామని వ్యాఖ్య
- కొత్త ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నానన్న స్వామి
ఓటమి తనకు కానీ, తన కుటుంబానికి కానీ కొత్త కాదని కుమారస్వామి అన్నారు. గతంలో తాను, తన తండ్రి దేవెగౌడ, తన సోదరుడు రేవణ్ణ కూడా ఓడిపోయామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. అధికారంలోకి రానున్న కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెపుతున్నానని... నూతన ప్రభుత్వం ప్రజల అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.