పెళ్లి సంబంధం అంటూ రిటైర్డ్ ఉద్యోగికి రూ.26 లక్షలు టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు
- ఇద్దరు కుమార్తెల వివరాలు మ్యాట్రిమోనియల్ సైట్ లో ఉంచిన వృద్ధుడు
- ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అబ్బాయిలతో సంబంధం అంటూ ఎర
- పలు దఫాలుగా రూ. 26 లక్షలు ఇచ్చి మోసపోయిన రిటైర్డ్ ఉద్యోగి
వారం రోజుల పాటు ఇరువైపుల నుంచి ఫోన్లలో మాట్లాడుకున్నారు. ముందుగా ఫోన్ చేసిన వ్యక్తి తన కుమారుడు అమెరికా వెళ్లాలని, ఇద్దరు అమ్మాయిలకు ముందుగానే నిశ్చితార్థం పెట్టుకుందామని చెప్పాడు. ఇందుకు డబ్బులు కావాలని కోరాడు. అతని మాటలు నమ్మిన రిటైర్డ్ ఉద్యోగి పలు దఫాలుగా రూ. 26 లక్షలు ముట్టచెప్పారు. కానీ, సంబంధం కలుపుకున్న వాళ్లు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి సదరు మ్యాట్రిమోనియల్ సైట్ ను సంప్రదించారు. ఆయన చెప్పిన వివరాలతో తమ వెబ్ సైట్ లో ఎవ్వరూ లేరని చెప్పడంతో మోసపోయానని తెలుసుకున్నారు. దాంతో, రిటైర్డ్ ఉద్యోగి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.