మంత్రి కేటీఆర్కు ఏషియా బెర్లిన్ సదస్సు ఆహ్వానం
- జర్మనీలో జూన్12–15 మధ్య జరగనున్న సదస్సు
- ‘కనెక్టింగ్ స్టార్టప్ ఇకో సిస్టం’ అనే అంశంపై సదస్సు
- దీనికి హాజరై ప్రసంగించాలని కేటీఆర్ కు ఆహ్వాన పత్రిక
ఈ సంవత్సరం జరిగే సదస్సు మొబిలిటీ, లాజిస్టిక్స్, ఎనర్జీ, గ్రీన్ టెక్, వాతావరణ మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ప్రధానమైన అంశాలను విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపింది. ఈ సమావేశంలో భాగంగా పెట్టుబడిదారులకు ప్రత్యేకమైన సెషన్ ఉంటుందని, అద్భుతమైన ఆలోచనలున్న స్టార్టప్ కంపెనీలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. కాగా, ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరుకావాలంటూ కేటీఆర్ కు ఇప్పటికే ఆహ్వానం అందించిన సంగతి తెలిసిందే.