Anitha: వైసీపీని వీడే మంత్రుల జాబితాలో ఉషశ్రీ ముందుంటారు: అనిత
ఆంధ్ర ప్రదేశ్ లో గత నాలుగేళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో మంత్రి ఉషశ్రీ చరణ్ చెప్పాలని తెలుగు దేశం పార్టీ నేత వంగలపూడి అనిత శనివారం డిమాండ్ చేశారు. గ్రామాల్లో అభివృద్ధి జరిగితే గడపగడపకు కార్యక్రమంలో వైసీపీ నేతలు ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. వైసీపీ నేతలపై ప్రజలు చెప్పులు కూడా ఎందుకు విసురుతున్నారో చెప్పాలన్నారు. మున్ముందు వైసీపీని వీడే మంత్రుల జాబితాలో ఉషశ్రీ చరణ్ ముందుంటారన్నారు.