కాసేపట్లో బ్రిటన్ రాజు పట్టాభిషేకం.. వేడుకకు హాజరవుతున్న భారత ప్రముఖులు వీరే!

Indian invitees to Britain King Charles 3 coronation
  • బ్రిటన్ రాజు పట్టాభిషేకానికి విచ్చేసిన 203 దేశాల ప్రతినిధులు
  • భారత ప్రభుత్వం తరపున హాజరైన ఉప రాష్ట్రపతి ధన్ కర్
  • సినీ నటి సోనమ్ కపూర్ కు ఆహ్వానం
బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్-3 ఈరోజు పట్టాభిషిక్తులు కానున్నారు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో పట్టాభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి 203 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు 12 వేల మంది పోలీసులు, 10 వేల మంది సైనికులను మోహరించారు. మరోవైపు మన దేశం నుంచి కూడా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతున్నారు. 

 హాజరవుతున్న భారతీయ ప్రముఖులు:

ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్: భారత ప్రభుత్వం తరపున ధన్ కర్ అధికారికంగా హాజరవుతున్నారు. నిన్ననే ఈయన సతీసమేతంగా లండన్ చేరుకున్నారు. లండన్ లో ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది. 

సినీ నటి సోనమ్ కపూర్: వేడుకల్లో భాగంగా కామన్వెల్త్ గాయక బృందం కార్యక్రమం ఉంటుంది. ఈ బృందానికి స్వాగతం పలుకుతూ సోనమ్ కపూర్ రెండు మాటలు మాట్లాడతారు. 

ముంబై డబ్బావాలాలు: ముంబైలో అత్యంత పేరుగాంచిన డబ్బావాలాల తరపున వారి ప్రతినిధి హాజరవుతున్నారు. ఈ సందర్భంగా రాజుకు వర్కారీ కమ్యూనిటీ తయారు చేసిన పునేరీ టర్బన్ తో పాటు శాలువా బహూకరిస్తారు. ముంబైలో లంచ్ బాక్సులు అందిస్తూ డబ్బావాలాలు ఎంతో సేవ చేస్తున్న సంగతి తెలిసిందే. 

సౌరభ్ పడ్కే: పూణెకు చెందిన 37 ఏళ్ల సౌరభ్ ఒక ఆర్కిటెక్ట్. చార్లెస్ ఫౌండేషన్, ప్రిన్స్ ఫౌండేషన్ స్కూల్ లో ఆయన చదువుకున్నారు. 

గుల్ఫ్ షా: 33 ఏళ్ల గుల్ఫ్ షా గత ఏడాది ప్రిన్స్ ట్రస్ట్ గ్లోబల్ అవార్డును అందుకున్నారు. ఈమె ఢిల్లీకి చెందినవారు. కన్స్ స్ట్రక్షన్ ప్రాజెక్టులకు ప్రైస్ ఎస్టిమేట్స్ అందించే కంపెనీలో పని చేస్తున్నారు. 

జై పటేల్: ఈయన కెనడాలో ఉంటారు. టొరంటోలోని ఐకానిక్ సీఎన్ టవర్ లో షెఫ్ గా పని చేస్తున్నారు. 'ప్రిన్స్ ట్రస్ట్ కెనడా' అందించే కెనడాస్ యూత్ ఎంప్లాయ్ మెంట్ ప్రోగ్రామ్ ను గత ఏడాది పూర్తి చేశారు.
Go Back to Shorts
Britain
King
Charles
Coronation
India
Invitees

More Telugu News