Karthik Raju: రిలీజ్ కి రెడీ అవుతున్న మరో క్రైమ్ థ్రిల్లర్ .. 'అథర్వ'

  • కార్తీక్ రాజు హీరోగా రూపొందిన 'అథర్వ'
  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • ముగింపు దశలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు 
  • జూన్ లో ఐదు భాషల్లో విడుదల
Atharva movie update

క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందే సినిమాలను చూడటానికి ఒక వర్గం ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలాంటి ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి 'అథర్వ' సిద్ధమవుతోంది. కార్తీక్ రాజు - సిమ్రాన్ చౌదరి జంటగా నటించిన ఈ సినిమా, విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సుభాష్ నిర్మించిన ఈ సినిమాకి మహేశ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా ఉత్కంఠభరితంగా కొనసాగనుంది. ఎప్పుడు ఏం జరుగుతుందా? అనే ఆసక్తితో ప్రేక్షకులు వెయిట్ చేస్తూ ఉండేలా ఈ కథ నడుస్తుందని దర్శకుడు చెబుతున్నాడు. 

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశకి చేరుకున్నాయి. ఐరా .. అరవిందకృష్ణ .. కబీర్ సింగ్ దుల్హన్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. తెలుగుతో పాటు, తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో, జూన్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.


More Telugu News