Jagan: మల్లాది విష్ణుకు మాతృవియోగం... సీఎం జగన్ పరామర్శ

  • చికిత్స పొందుతూ మరణించిన విష్ణు తల్లి బాలాత్రిపుర సుందరమ్మ 
  • బాలాత్రిపుర సుందరమ్మ భౌతికకాయానికి సీఎం జగన్ నివాళులు
  • ముఖ్యమంత్రి వెంట మంత్రి జోగి రమేశ్ 
CM Jagan visits Malladi Vishnu residence

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి బాలాత్రిపుర సుందరమ్మ ఈ ఉదయం కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుటుంబంలో విషాదం నెలకొంది. 

ఈ నేపథ్యంలో, సీఎం జగన్ విజయవాడ ఎంజీ రోడ్ లోని మల్లాది విష్ణు నివాసానికి వచ్చారు. తల్లి మరణంతో బాధపడుతున్న మల్లాది విష్ణును పరామర్శించారు. బాలాత్రిపుర సుందరమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అక్కడున్న ఆమె చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన వెంట మంత్రి జోగి రమేశ్ కూడా ఉన్నారు.

More Telugu News