Vande Bharat Train: వందేభారత్ ఎక్స్ ప్రెస్ పై ఏపీలో రాళ్ల దాడి

  • గూడూరు సమీపంలో ఘటన
  • వేగంగా వెళుతున్న వందేభారత్ రైలు
  • రాళ్లు విసిరిన గుర్తుతెలియని వ్యక్తులు
  • పగిలిన బోగీ అద్దం
  • రేణిగుంట రైల్వే పోలీసులకు ఫిర్యాదు
Stone pelting on Secunderabad Tirupati Vande Bharat express

దేశంలోనే అత్యంత వేగగామి ట్రైన్ గా పేరుగాంచిన వందేభారత్ రైళ్లపై రాళ్ల దాడి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుపై ఏపీలో రాళ్ల దాడి జరిగింది. నిన్న గూడూరు సమీపంలో ఈ దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు వేగంగా వెళుతున్న రైలుపై రాళ్లు విసిరారు. 

ఈ ఘటనలో రైలు బోగీ అద్దం పగిలినట్టు రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలు కూడా పలుమార్లు రాళ్ల దాడికి గురైన సంగతి తెలిసిందే.

More Telugu News