Andhra Pradesh: నేడు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు.. ఈదురు గాలులు!

  • మరాఠ్వాడా మీదుగా కర్ణాటక వరకు ద్రోణి 
  • నిన్న కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు
  • అనంతపురంలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
Rains Expected Today In Rayalaseema And Coastal Andhra

విదర్భ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా మరాఠ్వాడ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో నిన్న అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని, అదే సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

నిన్న మధ్యాహ్నం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉక్కపోతతోపాటు ఎండ తీవ్రత కొనసాగింది. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అనంతపురంలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.

More Telugu News