గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- 2020 నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్
- శాఖాపరమైన పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ప్రొబేషన్
- రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకోవడం తప్పనిసరి
- మే 1 నుంచి కొత్త పే స్కేళ్లు
ప్రొబేషన్ ద్వారా సచివాలయ ఉద్యోగాలకు భద్రత ఏర్పడినట్టయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే సచివాలయ సిబ్బంది నియామకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. సచివాలయ సిబ్బందిని క్రమబద్ధీకరించేందుకు వీలు కల్పించే ప్రొబేషన్ డిక్లరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆమోదం తెలిపింది.