KTR: తన పీఏ తిరుపతిపై వచ్చిన ఆరోపణల పట్ల కేటీఆర్ స్పందన

  • టీఎస్ పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారంలో కేటీఆర్ పీఏపై ఆరోపణలు
  • తన పీఏ వెంట పడుతున్నారేంటి అంటూ కేటీఆర్ ఆగ్రహం
  • రేవంత్, బండి సంజయ్ ఎప్పుడైనా పరీక్షలు రాశారా అంటూ వ్యంగ్యం
  • నకిలీ సర్టిఫికెట్లతో నిజామాబాద్ ఎంపీ దొరికిపోయాడని ఎద్దేవా
KTR reacts to allegations on his PA Tirupati

టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో తన పీఏ తిరుపతి పాత్ర ఉందంటూ ప్రచారం జరుగుతుండడం పట్ల మంత్రి కేటీఆర్ స్పందించారు. నా పీఏ వెంట పడుతున్నారేంటి? అని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా మొత్తంలో ఒక్కరే క్వాలిఫై అయ్యారని వెల్లడించారు. తన పీఏ తిరుపతి స్వగ్రామం పోతారంలో పరీక్ష రాసింది ముగ్గురైతే అందులో ఒక్కరూ క్వాలిఫై కాలేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

మల్యాలలో 415 మంది పరీక్ష రాయగా 35 మంది అర్హత సాధించారని వివరించారు. సిరిసిల్ల జిల్లాలో 3,250 మంది పరీక్షలు రాస్తే ఒక్కరికి కూడా 100 మార్కులు దాటలేదని స్పష్టం చేశారు. మరి నేను లీక్ చేసింది ఎక్కడ? అని కేటీఆర్ ప్రశ్నించారు. 

నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా? అంటూ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్, బండి సంజయ్ తమ జీవితంలో ఎప్పుడైనా పరీక్షలు రాశారా? అని వ్యంగ్యం ప్రదర్శించారు. నకిలీ సర్టిఫికెట్లతో దొరికిపోయింది ఎవరు... నిజామాబాద్ ఎంపీ కాదా? అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలు చెప్పాను... రేవంత్ రెడ్డీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? అని నిలదీశారు.

More Telugu News