250 years j: చిట్ ఫండ్స్ పేరుతో మోసం.. 250 ఏళ్ల జైలు శిక్ష

  • సీహోర్ జిల్లా కోర్టు తీర్పు
  • దేశంలో అత్యధిక జైలు శిక్ష తీర్పు ఇదే
  • 18 శాతం రాబడి ఆశ చూపి భారీగా వసూళ్లు
  • చివరికి ఏమీ ఇవ్వకుండా చేతులెత్తేసిన సంస్థ
Man gets 250 years jail in Rs 4000 crore chit fund case

చిట్ ఫండ్స్ పేరుతో సామాన్యులను నిండా ముంచిన ఓ సంస్థ డైరెక్టర్ కు కోర్టు కఠిన శిక్ష విధించింది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల పరిధిలో 35 లక్షల మంది ఇన్వెస్టర్లను రూ.4,000 కోట్ల మోసం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో మధ్యప్రదేశ్ లోని సీహోర్ జిల్లా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

సాయి ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ బాలాసాహెబ్ భాప్కర్ ను నిందితుడిగా ప్రకటించిన కోర్టు.. 250 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దేశంలో ఒక నేరస్థుడికి అత్యధిక జైలు శిక్ష ప్రకటించడం ఇదే మొదటిసారి. ఈ కేసులో భాప్కర్ తోపాటు ఇతరులను నిందితులుగా న్యాయస్థానం ప్రకటించింది. 

ఐదేళ్లలో డబ్బు రెట్టింపు ఇస్తామన్న హామీతో చాలా మంది ప్రజలు ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేశారు. ఏటా 18 శాతం రాబడి ఆశ చూపించాడు. కానీ, ప్రాజెక్టుల నిర్మాణాన్ని మందుకు తీసుకెళ్లలేదు. ఇన్వెస్టర్లకు డబ్బులు తిరిగి చెల్లించలేదు. దీంతో కొందరు పోలీసులను ఆశ్రయించారు.

More Telugu News