Team India: టీమిండియాతో చివరి వన్డేలో టాస్ గెలిచిన ఆసీస్

  • భారత్, ఆసీస్ మధ్య 3 వన్డేల సిరీస్
  • చెన్నై వేదికగా నేడు చివరి వన్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూలు
Aussies won the toss against Team India

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నేడు చివరి వన్డే జరుగుతోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ మరోసారి ధాటిగా ఆడుతూ తమ జట్టుకు శుభారంభం అందించారు. 10.5 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు 1 వికెట్ నష్టానికి 68 పరుగులు. 

33 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం ఓపెనర్ మిచెల్ మార్ష్ 34, కెప్టెన్ స్టీవ్ స్మిత్ (0 బ్యాటింగ్)  క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ లో సీనియర్ ఆటగాడు డేవిడ్ వార్నర్ కూడా ఆడుతుండడంతో ఆసీస్ జట్టులో మరింత ఉత్సాహం నెలకొంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో ఎలాంటి మార్పులు లేవు. కాగా, ఈ సిరీస్ లో భారత్, ఆసీస్ చెరో మ్యాచ్ గెలవడం తెలిసిందే. నేటి మ్యాచ్ లో గెలిచిన జట్టుకు సిరీస్ వశమవుతుంది.

More Telugu News