లండన్ లో భారత పతాకాన్ని అగౌరవపరిచిన ఖలిస్థానీ మద్దతుదారులు.. కేంద్ర సీరియస్!
- అక్కడి భారత హైకమిషన్ భవనంపై త్రివర్ణ పతాకాన్ని కిందకు దింపిన వైనం
- దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత విదేశాంగ శాఖ
- వివరణ ఇవ్వాలని ఢిల్లీలోని బ్రిటన్ దౌత్యవేత్తలకు నోటీసులు
ఈ సంఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు ఢిల్లీలోని బ్రిటన్ సీనియర్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. లండన్లో ఖలిస్థాన్ వేర్పాటువాదులు చేసిన పనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు భారత్ పేర్కొంది. దీనికి బాధ్యులైన వారిపై వెంటనే అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ చర్యను తీవ్రమైనదిగా పరిగణించిన భారత విదేశాంగ శాఖ అక్కడకు నిరసనకారులు వచ్చేంతవరకూ భారత హైకమిషన్ భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఘటనపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరింది.