Australia: టీమిండియాతో తొలి వన్డే... కష్టాల్లో కంగారూలు

  • ముంబయిలో భారత్, ఆసీస్ తొలి వన్డే
  • టాస్ గెలిచి ఆసీస్ కు బ్యాటింగ్ అప్పగించిన భారత్
  • 139 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్
  • ధాటిగా ఆడిన మిచెల్ మార్ష్
Aussies loses four wickets

టీమిండియాతో తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ 139 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. సిరాజ్, హార్దిక్ పాండ్యా, జడేజా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. 

ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్ ధాటిగా ఆడి భారత శిబిరంలో అలజడి రేపాడు. మార్ష్ 65 బంతుల్లో 10 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. మార్ష్ ను జడేజా అవుట్ చేయడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. అప్పటికి ఆసీస్ స్కోరు 3 వికెట్లకు 129 పరుగులు కాగా, మరికాసేపటికే మార్నస్ లబుషేన్ (15) ను కుల్దీప్ యాదవ్ అవుట్ చేయడంతో ఆసీస్ నాలుగో వికెట్ జార్చుకుంది. 

ప్రస్తుతం ఆసీస్ స్కోరు 25 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లకు 151 పరుగులు. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ 12 పరుగులతోనూ, ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ 6 పరుగులతోనూ ఆడుతున్నారు.

More Telugu News