ఆస్కార్ అందుకొని హైదరాబాద్ చేరుకున్న ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం
- ఈ తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన రాజమౌళి, కీరవాణి కుటుంబ సభ్యులు
- ఘన స్వాగతం పలికిన అభిమానులు
- జై హింద్ అంటూ బయటికి వచ్చిన రాజమౌళి
విమానాశ్రయంలో రాజమౌళి మీడియాతో మాట్లాడలేదు. నవ్వుతూ, హుషారుగా కనిపించిన ఆయన జైహింద్ అంటూ వెళ్లిపోయారు. జాతీయ మీడియాతో మాట్లాడిన కాలభైరవ.. ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ పాటను లైవ్ లో పాడటం తన జీవితంలోనే గొప్ప క్షణం అన్నారు. ఆస్కార్ అవార్డును అందుకోవడం చిరకాలం గుర్తుండిపోయ సందర్భం అన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ వరించిన సంగతి తెలిసిందే.