Parliament: రేపటి నుంచి రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

Second phase Parliament Budgets sessions will commence from tomorrow
షార్ట్స్‌లో చూడండి
జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రేపటి నుంచి రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు ఏప్రిల్ 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ ఆమోదం, గ్రాంట్లపై చర్చ చేపట్టనున్నారు. 

ఫైనాన్స్ బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం... అదానీ వ్యవహారం, ఈడీ, సీబీఐ, ఐటీ దాడులపై కేంద్రాన్ని తూర్పారబట్టాలని విపక్షాలు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. అదానీ-హిండెన్ బర్గ్ వివాదంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఉభయ సభల్లో పోరాడనుంది. 

రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పందించారు. ఫైనాన్స్ బిల్లును ఆమోదింపజేసుకోవడమే తమ ప్రథమ ప్రాధాన్యత అంశం అని, ఆ తర్వాతే ప్రతిపక్షాల డిమాండ్లపై చర్చిస్తామని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Parliament
Budget Session
Second Phase
India

More Telugu News