బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ పేలుడు... 14 మంది మృతి
- పాత ఢాకాలోని ఓ భవనంలో పేలుడు
- 70 మందికి గాయాలు
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
- నిల్వ ఉంచిన రసాయనాలే పేలుడుకు కారణమని అనుమానం
పేలుడుకు కారణం స్పష్టంగా తెలియకపోయినా, ఆ భవనంలో రసాయనాలు అక్రమంగా నిల్వచేస్తున్నారని, పేలుడుకు రసాయనాలే కారణం అయ్యుండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి సిద్ధిక్ బజార్ మొత్తం ఊగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భూకంపం సంభవించి ఉంటుందని భావించినట్టు సఫాయత్ హుస్సేన్ అనే వ్యక్తి వెల్లడించాడు.