Team India: టీ20 వరల్డ్ కప్ సెమీస్... ఆసీస్ తో తలపడుతున్న టీమిండియా అమ్మాయిలు

  • దక్షిణాఫ్రికాలో మహిళల టీ20 వరల్డ్ కప్
  • సెమీఫైనల్లో టీమిండియా వర్సెస్ ఆసీస్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
Team India takes up Aussies in T20 World Cup semis

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా అమ్మాయిలు నేడు సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడుతున్నారు. కేప్ టౌన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 6 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. ఓపెనర్లు అలీసా హీలీ 23, బెత్ మూనీ 19 పరుగులతో ఆడుతున్నారు. ఓపెనింగ్ జోడీని విడదీసేందుకు టీమిండియా బౌలర్లు చెమటోడ్చుతున్నారు. 

కాగా, ఈ మ్యాచ్ లో ఆసీస్ ను 150 పరుగుల లోపే కట్టడి చేస్తేనే టీమిండియాకు విజయావకాశాలు ఉంటాయి. మెరుగైన బౌలింగ్ వనరులున్న ఆసీస్ పై లక్ష్యఛేదన ఏమంత సులువు కాదు. మరి టీమిండియా అమ్మాయిలు ఏంచేస్తారో చూడాలి.

More Telugu News