చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా
- ఆమోదించిన బీసీసీఐ కార్యదర్శి జై షా
- ఇటీవల ఓ స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ వ్యాఖ్యలు వివాదాస్పదం
- బోర్డు సీరియస్ గా తీసుకోవడంతో రాజీనామా చేసిన శర్మ
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు వచ్చాయన్నాడు. జట్టుకు సంబంధించి సున్నిత, రహస్య విషయాలు వెల్లడించాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సీరియస్ గా తీసుకుంది. అంతర్గత వ్యవహారాలను బహిర్గతం చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో, గత నెలలోనే మరో పర్యాయం చీఫ్ సెలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన శర్మ పదవి నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.