చౌటుప్పల్ లో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
- ఆటోను ఢీ కొట్టిన ప్రైవేటు బస్సు
- నలుగురు మహిళా కూలీలు మృతి
- ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం
దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్కు దగ్గర్లో ఆటో బస్సు ఢీ కొన్నాయని పోలీసులు తెలిపారు. దేవలమ్మ నాగారం నుంచి వస్తున్న ఆటోను అబ్దుల్లాపూర్ మెట్ వెళ్తున్న బస్సు ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మహిళా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్ కు తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారని అధికారులు చెప్పారు. చనిపోయిన వారిని డాకోజి నాగలక్ష్మి, వరకాంతం అనసూయ, సిలివేరు దనలక్ష్మి, దేవరపల్లి శిరీషలుగా గుర్తించినట్లు వెల్లడించారు.