YS Sharmila: పాదయాత్రలో తాటికల్లును రుచి చూసిన షర్మిల

YS Sharmila tastes Thati Kallu
  • లక్ష్మీనారాయణపురం వద్ద ఆసక్తికర సన్నివేశం
  • కల్లును రుచి చూడాల్సిందిగా కోరిన కల్లుగీత కార్మికుడు
  • ఆయన కోరిక మేరకు కల్లు రుచి చూసిన షర్మిల
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాదయాత్రలో భాగంగా తాటికల్లును ఆమె రుచి చూశారు. జనగామ జిల్లా లక్ష్మీనారాయణపురం వద్ద ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఆమె నడుస్తుండగా దగ్గరకు వచ్చిన ఓ కల్లుగీత కార్మికుడు... కల్లును రుచి చూడాల్సిందిగా కోరాడు. దీంతో, ఈయన కోరిక మేరకు ఆమె కల్లును రుచి చూశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు నానాటికీ పెరుగుతున్న ఎండల్లో సైతం ఆమె పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ షర్మిల పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

More Telugu News

YS Sharmila
YSRTP
Tati Kallu