రేపటి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి... హాజరుకానున్న చంద్రబాబు

TDP Chief Chandrababu will tour in East Godavari district tomorrow
  • వైసీపీ పాలనను విమర్శిస్తూ 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమం
  • ఇప్పటికే పలు జిల్లాల్లో నిర్వహణ
  • ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు
  • రోడ్ షో ఏర్పాటు చేసిన టీడీపీ నేతలు
సీఎం జగన్ పాలనను విమర్శిస్తూ టీడీపీ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరిట ఓ కార్యక్రమం రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. రేపటి నుంచి మూడ్రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించనున్నారు. 

ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరవుతున్నారు. చంద్రబాబు పర్యటన జగ్గంపేట, పెద్దాపురం, అనపర్తి నియోజకవర్గాల్లో సాగనుంది. చంద్రబాబు పర్యటనలో టీడీపీ నేతలు రోడ్ షో ఏర్పాటు చేశారు.
Go Back to Shorts
Chandrababu
East Godavari District
Idem Kharma Mana Rashtraniki
TDP

More Telugu News