ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారు: కేఏ పాల్
- వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ప్రజలు ఓడిస్తారన్న పాల్
- కేసీఆర్ తన ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారని మండిపాటు
- మోదీ, అదానీలు దేశ పరువు తీస్తున్నారని విమర్శ
తన ఫోన్ ను కేసీఆర్ ట్యాప్ చేయిస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. తాను కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులతో మాట్లాడటంపై నిఘా ఉంచారని విమర్శించారు. తెలంగాణలో తానే సీఎం కావాలని 70 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఇదే సమయంలో ప్రధాని మోదీపై ఆయన విమర్శలు గుప్పించారు. మోదీ, అదానీ ఇద్దరూ కలిసి దేశం పరువు తీస్తున్నారని విమర్శించారు.