ఏపీ నూతన గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
- ఏపీ కొత్త గవర్నర్ గా అబ్దుల్ నజీర్
- నిజాయతీ, చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అని కొనియాడిన చంద్రబాబు
- ప్రజాస్వామ్య విలువలు కాపాడతారన్న నమ్మకం ఉందని వెల్లడి
- పదవిలో విజయవంతం కావాలని ఆకాంక్ష
అబ్దుల్ నజీర్ చిత్తశుద్ధి, నిజాయతీ ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారని, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో కచ్చితంగా ఆయన ముందుంటారని భావిస్తున్నానని తెలిపారు. పదవిలో ఆయన విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు.