జోడో యాత్ర మూడో రోజునే రాహుల్ గాంధీ ఆగిపోవాలనుకున్నారు: కాంగ్రెస్ సీనియర్ నేత
- కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు జోడో యాత్ర చేసిన రాహుల్
- యాత్ర మూడో రోజునే తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడ్డ రాహుల్ గాంధీ
- తన స్థానంలో మరొకరికి యాత్ర బాధ్యతలు అప్పగించాలనుకున్నారని కేసీ వేణుగోపాల్ వెల్లడి
రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ ఆ ఆలోచనను సమర్థించారన్నారు. అయితే, మోకాళ్ల నొప్పులకు ఫిజియోథెరపీ చేయించుకున్నతర్వాత రాహుల్ యాత్రను పూర్తి చేశారన్నారు. కాగా, రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’ను గతేడాది సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభించారు. ఈ ఏడాది జనవరి 30న కశ్మీరులో ముగించారు. 4,080 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రాహుల్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు, 12 రాష్ట్రాల్లోని 75 జిల్లాల మీదుగా నడిచారు.