ప్రపంచంలోనే పులులకు రాజధాని భారత్
- 70 శాతం పులులు భారత్ లోనే
- 76,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 2,967 పెద్ద పులులు
- దేశవ్యాప్తంగా 53 పులుల అభయారణ్యాలు
- సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
మన దేశం 2018 లోనే పెద్ద పులుల సంఖ్యను రెట్టింపునకు చేర్చుకుంది. పులుల సంరక్షణ విషయంలో నాలుగేళ్ల ముందుగానే నిర్దేశిత లక్ష్యాన్ని సాధించినట్టు కేంద్ర సర్కారు తెలిపింది. అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి ఈ మేరకు సుప్రీంకోర్టుకు వివరాలు అందించారు. మన దేశంలో పులుల అభయారణ్యాల సంఖ్య 53కు చేరుకుంది. దేశవ్యాప్తంగా వీటి పరిధిలో 76,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 2,967 పులులు జీవిస్తున్నాయి. పెద్ద పులుల కృత్రిమ సంతానోత్పత్తికి అవకాశం లేదని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఈ అఫిడవిట్ లో పేర్కొంది. వాటికి మన దేశంలో ఆమోదం లేదని వివరించింది.