‘వందేభారత్’పై మళ్లీ దాడి.. ఈసారి బీహార్లో
- ‘వందేభారత్’ రైళ్లపై కొనసాగుతున్న రాళ్ల దాడులు
- పశ్చిమ బెంగాల్, విశాఖలోనూ దాడులు
- బీహార్లోని కతిహార్ జిల్లాలో తాజా ఘటన
- పగిలిన సి6 బోగీ అద్దాలు
అలాగే, సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైలు ప్రారంభానికి ముందే విశాఖలో దాడి జరిగింది. ట్రయల్ రన్ ముగించుకుని మర్రిపాలెంలోని కోచ్ మెయింటెనెన్స్ సెంటర్కు వెళ్తున్న రైలుపై కొందరు దుండగులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలోనూ కిటీకి అద్దాలు దెబ్బతిన్నాయి. వందేభారత్ రైళ్లపై జరుగుతున్న వరుస రాళ్ల దాడులు అధికారులను కలవరపెడుతున్నాయి.