ధర ఎక్కువే.. అయినా 2024 మార్చి వరకు బుకింగ్ ఫుల్! ‘గంగా విలాస్ క్రూయిజ్ టూర్’కు డిమాండ్
- ఒక్క రోజు ప్రయాణానికి రూ.25 వేల నుంచి రూ.50 వేలు వెచ్చించాల్సిందే
- ప్రయాణంలో అతిథులకు శాఖాహార భోజనం మాత్రమే పెడతామన్న నిర్వాహకులు
- ఆల్కహాల్ కు క్రూయిజ్ లో అనుమతిలేదని వివరణ
ఈ క్రూయిజ్ లో ప్రయాణించాలని అనుకుంటే అంతారా లక్జరీ క్రూయిజ్ వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని, 2024 ఏప్రిల్ తర్వాతే టికెట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ షిప్ లో వారణాసి నుంచి దిబ్రూగఢ్ కు ప్రయాణించాలంటే మొత్తం 51 రోజులు పడుతుందని రాజ్ సింగ్ చెప్పారు.
ఇందుకోసం ఒక్కో టికెట్ సగటున రూ.20 లక్షలని చెప్పారు. ఇందులో ఒక్క రోజు ప్రయాణం చేయాలంటే రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు వెచ్చించాలని తెలిపారు. ప్రయాణంలో తమ అతిథులకు శాఖాహార భోజనం పెడతామని రాజ్ సింగ్ చెప్పారు. మాంసాహార భోజనం, ఆల్కహాల్ కు క్రూయిజ్ లో అనుమతి లేదని రాజ్ సింగ్ స్పష్టంచేశారు.