తన గాయం గురించి స్పష్టత నిచ్చిన భారత కెప్టెన్ పాండ్యా
- నిన్న శ్రీలంకతో తొలి టీ20లో భారత్ ఉత్కంఠ విజయం
- కాలు కండరాలు పట్టేయడంతో మైదానం వీడిన పాండ్యా
- తనకు ఎలాంటి గాయం అవ్వలేదని చెప్పిన హార్దిక్
అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడిన హార్దిక్ తాను బాగానే ఉన్నానని చెప్పాడు. కొద్దిసేపు కండరాలు పట్టేయడం తప్పితే తనకు ఎలాంటి గాయం అవ్వలేదని తెలిపాడు. మ్యాచ్ కు ముందు సరిగ్గా నిద్రలేకపోవడం, తగినన్ని నీళ్లు తాగకపోవడంతో కొంత ఇబ్బంది కలిగిందన్నాడు. ఇక, చివరి ఓవర్లో స్పిన్నర్ అక్షర్ పటేల్ తో బౌలింగ్ చేయించడాన్ని పాండ్యా సమర్థించుకున్నాడు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని చెప్పేందుకే ఇలా చేశానన్నాడు. ఈ మ్యాచ్ లో గొప్పగా రాణించిన యువకులను, ముఖ్యంగా అరంగేట్రం బౌలర్ శివం మావిని పాండ్యా ప్రశంసించాడు.