టీటీడీ ఈవో ధర్మారెడ్డి దంపతులకు వైఎస్ విజయమ్మ పరామర్శ
- ఇటీవలే మృతి చెందిన ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి
- వచ్చే నెల వివాహం జరగాల్సి ఉండగా ఆకస్మిక మరణం
- చంద్రమౌళి ఫొటోకు నివాళి అర్పించిన విజయమ్మ
అనంతరం ధర్మారెడ్డి దంపతులను ఓదార్చారు. అధైర్యపడొద్దని, తామంతా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. చంద్రమౌళికి టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి కుమార్తెతో వచ్చే నెల వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పత్రికలను పంచుతున్న సమయంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. ముఖ్యమంత్రి జగన్ ఇంతకు ముందే ఆయనకు నివాళి అర్పించి, ధర్మారెడ్డి దంపతులను పరామర్శించారు.