భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు.. అటువైపు చూసేందుకు కూడా భయపడుతున్న సామాన్యులు!
- గత నెలలో డజను గుడ్ల ధర రూ. 66
- ఇప్పుడు ఒక్కో గుడ్డు ధర ఏడు రూపాయలు
- కోళ్ల దాణా, విద్యుత్ చార్జీలు, కూలి ధరల పెరగడమే కారణం
- ఏపీలో రోజుకు 5 లక్షల గుడ్ల ఉత్పత్తి
గత నెలలో డజను గుడ్ల ధర రూ. 66గా ఉండగా ఇప్పుడు గుడ్డుకు రూపాయి పెంచి విక్రయిస్తున్నారు. కోళ్ల దాణా ధరలు పెరగడం, విద్యుత్ చార్జీలు, కూలి రేట్లు కారణంగానే ధరలు పెరిగినట్టు ఫామ్ యజమానులు చెబుతున్నారు. ధరల భారాన్ని తగ్గించుకునేందుకు కోళ్ల రైతులు గుడ్డుపై అర్ధ రూపాయి పెంచగా, వ్యాపారులు మరో అర్ధ రూపాయి పెంచి విక్రయిస్తున్నారు. దేశవ్యాప్తంగా రోజుకు దాదాపుగా 27 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిలో ఒక్క ఏపీలోనే 5 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఏపీ నుంచి సగానికి పైగా గుడ్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.