Vijayasai Reddy: ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు మన రాష్ట్రానికే ఖర్మ: విజయసాయిరెడ్డి

  • అధికారంలో లేకపోతే చంద్రబాబు ఏమైనా చేస్తాడన్న విజయసాయి
  • కక్షలు కార్పణ్యాలు రగుల్చుతాడని వ్యాఖ్యలు
  • తానే ఆరోపణలు చేస్తాడని వెల్లడి
Vijayasai Reddy take a swipe at Chandrababu

విపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. తాను అధికారంలో లేకపోతే చాలు.... గుడులు, బడులను సైతం తగలబెట్టి చలి కాల్చుకునే తత్వం చంద్రబాబుది అని విమర్శించారు. తానే కక్షలు కార్పణ్యాలు రగిల్చి, మళ్లీ లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని ఆరోపిస్తుంటాడని తెలిపారు. 

ప్రజలిచ్చిన తీర్పును గౌరవించడు... ఇలాంటి ప్రతిపక్ష నేత మన రాష్ట్రానికే ఖర్మ అని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 

"ఎన్నికలు సమీపిస్తుండడంతో మా చంద్రం అన్నయ్య తనలోని రాక్షసత్వాన్ని బయటపెట్టుకుంటున్నాడు. మాచర్లను మండించాడు. ఎచ్చెర్లలో ఏంచేస్తాడో? వీధుల్లో కుక్కల్లా టీడీపీ రౌడీలు స్వైరవిహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు... రాష్ట్రానికి ఇదేం ఖర్మ!" అంటూ విజయసాయి మరో ట్వీట్ చేశారు.

More Telugu News