ఎట్టకేలకు పుంజుకున్న భారత బౌలర్లు.. వెంటవెంటనే రెండు వికెట్లు
- నాలుగో రోజు తొలి సెషన్ లో ఒక్క వికెట్ దక్కని వైనం
- లంచ్ తర్వాత జోరు పెంచిన భారత బౌలర్లు
- ఓపెనర్ శాంటో, యాసిర్ అలీ ఔట్
కానీ, నాలుగో రోజు ఆటలో ఆ జట్టు ఓపెనర్లు నజ్ముల్ శాంటో (67), జాకిర్ హసన్ (65 బ్యాటింగ్) దీటుగా పోరాడారు. తొలి సెషన్ లో వికెట్ ఇవ్వకుండా మొదటి వికెట్ కు 100 పైచిలుకు భాగస్వామ్యం నమోదు చేశారు. దాంతో, బంగ్లాదేశ్ లంచ్ టైమ్ కు వికెట్ నష్టపోకుండా 119 పరుగులు చేసింది. అయితే, లంచ్ తర్వాత భారత బౌలర్లు పుంజుకున్నారు. విరామం నుంచి వచ్చిన వెంటనే శాంటోను ఉమేశ్ యాదవ్.. ఔట్ చేశాడు.
దాంతో, తొలి వికెట్ కు 124 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మూడు ఓవర్ల తర్వాత వన్ డౌన్ బ్యాటర్ యాసిర్ అలీ (5)ని అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం 55 ఓవర్లలో బంగ్లా 140/2 స్కోరుతో నిలిచింది. ఆ జట్టు విజయానికి ఇంకా 373 పరుగులు అవసరం కాగా, భారత్ కు మరో ఎనిమిది వికెట్లు కావాలి.